టాడా కోర్టులో రేపు లొంగిపోనున్న సంజయ్దత్
ముంబయి, జనంసాక్షి: ముంబయి బాంబు పేలుళ్ల కేసులో శిక్ష కరారైన సంజయ్దత్ గురువారం టాడా కోర్టులో లొంగిపోతారని ఆయన తరపు న్యాయవాది ప్రకటించారు. తన ప్రాణాలను ముప్పు ఉన్నందున ఎరవాడ జైలులో లొంగిపోయేందుకు అనుమతి ఇవ్వాలని నిన్న సంజయ్దత్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.