టాడా కోర్టులో లొంగిపోయిన సంజయ్‌దత్‌

ముంబై, జనంసాక్షి: అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నాడనే ఆరోపణలపై శిక్షకు గురైన నిందితుడు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ కోర్టులో లొంగిపోయారు. సప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ ఆయన టాడా కోర్టుకు వచ్చి న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. సంజయ్‌దత్‌తో పాటు తయన సోదరి ప్రియాదత్‌, మహేశ్‌భట్‌ కూడా కోర్టుకు వచ్చారు. అక్రమాయుధాల కేసులో కోర్టు సంజయ్‌కి ఐదేళ్ల జైలు శిక్ష విధించగా ఆయన ఇప్పటికే ఏడాదిన్నర పాటు జైలులో గడిపారు. మరో మూడేళ్లు ఆయన జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. న్యాయమూర్తి ఆదేశాలతో సాయంత్రంలోగా పోలీసులు సంజయ్‌దత్‌ని జైలుకి తరలించే అవకాశం ఉంది.