టిడిపి కార్యాలయం ప్రారంభం
విజయవాడ,ఫిబ్రవరి24(జనంసాక్షి): విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి షబానా ఖాతూన్ టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ, కేశినేని నాని, బుద్దా వెంకన్న, జలీల్ఖాన్ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. కేశినేని నానిపై పోటీ చేయడానికి ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. ప్రజలు మరోసారి చంద్రబాబుకు పట్టంకడతారని ఆయన జోస్యం చెప్పుకొచ్చారు. వైసీపీకి చాలా చోట్ల అభ్యర్థులు కరువయ్యారన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘గతంలో నాకు 16 వేల మెజారిటీ వచ్చింది. జలీల్ఖాన్ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ సాధ్యంకాదన్నారు కానీ టీడీపీ ప్రభుత్వం చేసి చూపించింది. మరో 2 నెలల్లో దీనిని ప్రారంభిస్తాం. కృష్ణా జిల్లాలో 16, రాష్ట్రంలో 159 సీట్లు సాధిస్తాం’ అని ఎంపీ కేశినేని చెప్పుకొచ్చారు.