టీఆరెఎస్ లో 100 మంది చేరిక.

బెల్లంపల్లి, నవంబర్ 10, (జనంసాక్షి )
నెన్నెల మండలం ఆవడం, గంగారాం గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలకు చెందిన సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు గురువారం బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య సమక్షంలో టీఆరెఎస్ పార్టీలో చేరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్, బెల్లంపల్లి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టీఆరెఎస్ పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచారని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆరెఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అన్నారు. బంగారు తెలంగాణ సాదించుకోవడంలో అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రము శర వేగంగా దూసుకు పోతుందన్నారు. ఈకార్యక్రమంలో నెన్నెల ఎంపీపీ సంతోషం రమాదేవి, నెన్నెల ఎంపీటీసీ పురంశెట్టి తిరుపతి, మాజీ సింగల్ విండో చైర్మన్ ఇందూరి రమేష్, టీఆరెఎస్ సీనియర్ నాయకుడు గడ్డం భీమా గౌడ్, నాయకులు గోమాస ఏసు, షాకీర్ పాషా, తోకల తిరుపతి, గోమాస పోశం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు