టూవీలర్‌ను ఢీకొన్న కారు: నలుగురు మృతి

జయశంకర్‌ భూపాలపల్లి,మే31(జ‌నం సాక్షి): జిల్లాలోని ములుగు మండలం జాకారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. స్పాట్‌లోనే ఇద్దరు దుర్మరణం చెందగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు.  కారు – ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎంలో చికిత్స పొందుతూ తల్లి మావళిక, కుమార్తె అనుష(2) మృతి చెందారు. మృతులు శాయంపేట మండలం గంగిరేణిగూడెం వాసులుగా గుర్తించారు.  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు డీకొని వ్యక్తి మృతి
ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండల పరిధిలోని వేంపాడ్‌ సవిూపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మిర్యాలగూడ పట్టణంలోని సుందర్‌నగర్‌కు చెందిన లారీ డ్రైవర్‌ వేముల శంకర్‌(32) స్నేహితుడైన మహేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై హాలియాకు వెళ్లి సాయంత్రం తిరుగు పయనమయ్యారు. నిడమనూరు సవిూపంలోని బీఈడీ కళాశాల వద్దకు రాగానే దేవరకొండ నుంచి మిర్యాలగూడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొంది. శంకర్‌ తల విూద నుంచి బస్సు టైర్‌ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ వెనుకాల కూర్చున్న మహేష్‌ గాయపడ్డాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఐదేళ్ల కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ యాదయ్య తెలిపారు.