డబ్బులతో ఓట్లు కొనుగోళ్లు

దారుణంగా రాజకీయాలు: నటుడు సుమన్‌
తిరుమల,ఫిబ్రవరి24(ఆజ‌నంసాక్షి): రాజకీయాలు దారుణంగా తయారైన ఈ రోజుల్లో ప్రజల కోసం కష్టపడే నాయకుడ్ని ఎన్నుకోవాలని సినీనటుడు సుమన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజలు అభిమానంతో ఓటు వేసే పరిస్థితి కన్పించట్లేదు. కష్టపడే నాయకుడు, భవిష్యత్‌లో మంచి చేసే వారిని దృష్టిలో పెట్టుకుని నాయకుడ్ని ఎంపిక చేసుకుని ఓటు వేయాలి’ అని కోరారు. అర్ధరాత్రి వెళ్లి తలుపుతట్టి అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే నాయకుడ్ని ప్రజలు ఎంపిక చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలు సంతోషంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.