డాక్టరేట్ అవార్డు అందుకున్న శ్రీనయ్య

జనం సాక్షి, వంగూరు:
వంగూరు గ్రామానికి చెందిన బండపల్లి శ్రీనయ్య, పాల్ ఇవాంజెలికల్ మినిస్ట్రీస్ సొసైటీ ద్వారా కరోనా సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉచితంగా మెడికల్ క్యాంపులు, రూరల్ ప్రాంతాల్లో నిర్వహించారు. అలాగే అనేకమంది పేద ప్రజలకు బియ్యము మరియు కిరాణ వస్తువులు అంద చేశారు. అదేవిధంగా ట్రైబల్ స్టూడెంట్స్ , రూరల్ స్టూడెంట్స్ వాళ్లకు నోట్స్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ విధంగా సామాజిక కార్యక్రమాలు చేస్తూ దాదాపు 20,000 వేల మందికి  సహాయం అందజేశారు. 2020 నుంచి 2022 వరకు చేపట్టినటువంటి కార్యక్రమాలను గుర్తించి డే స్ప్రింగ్ క్రిస్టియన్ యూనివర్సిటీ అమెరికా ఛాన్స్లర్ డాక్టర్ ఆమోస్ చేతుల మీదుగా హైదరాబాద్ రవీంద్రభారతిలో డాక్టరేట్ ను శ్రీనయ్యకు ప్రధానం చేశారు.

తాజావార్తలు