డాక్టర్‌పై యాసిడ్‌ దాడి

తిరుపతిఫిబ్రవరి7(జ‌నంసాక్షి): మోసం చేశాడంటూ.. డాక్టర్‌పై ఓ నర్స్‌ యాసిడ్‌తో దాడి చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం తిరుపతి కోర్టు హాలులో చోటు చేసుకుంది. తిరుపతి నారాయణాద్రి ఆసుపత్రిలో నర్స్‌ గా పని చేస్తోన్న అరుణ అనే మహిళ, తనను డాక్టర్‌ ఆదర్శ్‌ మోసం చేశాడని ఆరోపిస్తూ.. గురువారం ఉదయం తిరుపతి కోర్టు హాలులో డాక్టర్‌ పై యాసిడ్‌ తో దాడి చేసింది. అనంతరం మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే మహిళను తిరుపతి వెస్ట్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని, తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.