డిఎస్సీ ఫలితాలు విడుదల చేసిన గంటా

రాజమహేంద్రవరం,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష మెరిట్‌ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాజమహేంద్రవరంలో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఫలితాలను విడుదల చేశారు.  మొత్తం 7,902 ఉపాధ్యాయ పోస్టులకు ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులకు 6,08,155 మంది దరఖాస్తు చేయగా.. 5,05,547 మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలు, స్జబెక్టుల వారీగా మెరిట్‌ జాబితాను ప్రకటించారు. మ్యూజిక్‌, క్రాప్ట్‌ పోస్టులను తొలిసారిగా భర్తీ చేశామని మంత్రి గంటా తెలిపారు. పరీక్షలోని 136 అభ్యంతరాలను స్వీకరించామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు మే 15న నియామక పత్రాలు అందజేయనున్నామని.. వారికి 10 రోజుల పాటు శిక్షణ ఇస్తామని చెప్పారు.