డెహ్రాడూన్‌ బయల్ధేరిన చంద్రబాబు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. వరద బాధితులను బాబు పరామర్శించారు. ఆయన వెళ్లిన విమానంలోనే తెలుగు యాత్రికులు రాష్ట్రానికి తిరిగి చేరుకోనున్నారు. తెలుగువారిని రాష్ట్రానికి తరలించే వరకు బాబు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.