డెహ్రాడూన్‌ వెళ్లనున్న సుశీల్‌కుమార్‌ షిండే

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): కేదార్‌నాథ్‌ను ఇంకా వరద ముప్పు వీడలేదు. ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీగా వర్షాలు పడుతున్నాయి. దాంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. అయితే వరద సహాయక చర్యలపై సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే శుక్రవారం డెహ్రాడూన్‌ రానున్నారు. అలాగే ఎన్‌డీఎంఏ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి కూడా డెహ్రాడూన్‌లో పర్యటించనున్నారు. అయితే అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కేదార్‌నాథ్‌ పరిసర ప్రాంతాల్లో సైన్యం రసాయనాలను చల్లుతుంది.