ఢిల్లీకి చేరుకున్న సీఎం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హస్తినకు చేరుకున్నారు. ఆయన రేపు ఇక్కడ జరిగే సోనియా జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపేందుకే సీఎం ఢిల్లీ వెళ్లారని తెలిసింది. అనంతరం ఆయన కాంగ్రెస్‌ పెద్దలు అహ్మద్‌పటేల్‌, గులాంనబీ ఆజాద్‌, చిదంబరం తదితరులను కలుసుకుంటారు.