ఢిల్లీలో కూలిన నాలుగంతస్థుల భవనం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తూర్పు ఢిల్లీలోని జఫ్రాబాద్‌ సమీపంలో నాలుగు అంతస్థుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. పోలీసులు, రెస్య్కూటీంలు ఘటనాస్థలికి చేరుకుని శిథిలాలను తొలగించి సహాయక చర్యలు చేపట్టారు.