ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
న్యూఢిల్లీ : 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్పథ్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం త్రివధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో ఉప రాష్ట్రపతి అన్సారీ, ప్రధాని మన్మోహన్సింగ్, లోక్సభ స్పీకర్ మీరాకుమార్ , కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, విపక్ష నేత ఎల్కే అద్వానీ తదితరులు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిధిగా బూటాన్ రాజు జిగ్మేకేషర్ వాంగ్చుక్ పాల్గొన్నారు.