ఢిల్లీ అత్యాచారం కేసులో మంగళవారం నుంచి విచారణ

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం కేసులో మంగళవారం నుంచి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ జరగనుంది. ఇందులో భాగంగా సాక్షాల నమోదును చేపట్టనున్నారు. ఈ ఘటనలో ఐదుగురి నిందితులపై కోర్టు నిన్న అభియోగాలను నమోదు చేపట్టనున్నారు. గత డిసెంబర్‌లో దక్షిణ ఢీల్లిలోని ఓ బస్సులో  సామూహిక అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థిని మృత్యువుతో పోరాడి 16 రోజుల అనంతరం సింగపూర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే.