ఢిల్లీ అత్యాచారం కేసులో విచారణ పూర్తి

ఢిల్లీ: గత డిసెంబరులో ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో అరో నిందితుడి (బాల నేరస్థుడు) విచారణ పూర్తయింది. ఈ కేసులో న్యాయస్థానం తీర్పును రిజర్వులో ఉంచినట్లు పీటీఐ పేర్కొంది. దేశ వ్యాప్తంగా యువత అందోళన చేపట్టిన ఈ కేసులో బాధితురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన సంగతి తెలిసిందే.