ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ఐకాస నేతలు

ఢిల్లీ : తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం, టీఎన్జీవో నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌ తదితరులు ఢిల్లీ వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు భాజపా అగ్రనేతలతో భేటీ కానున్నారు. అనంతరం ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌తో సమావేశం కానున్నారు.