తమను నిర్లక్ష్యం చేయలేరు: కుష్వా

పాట్నా,నవంబర్‌26(జ‌నంసాక్షి): ప్రధాని మోడీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు తాను మద్దతు ప్రకటిస్తున్నానని ఆర్‌ఎల్‌ఎస్‌పి నేత ఉపేంద్ర కుష్వా అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల ఒప్పందంలో బిజెపి, జెడియులకు గడువు విధించినట్లు ఉపేంద్ర కుష్వా వ్యాఖ్యానించారు. బీహార్‌ లోక్‌సభ ఎన్నికలలో బిజెపి, జెడియు సంకీర్ణంలో సీట్ల సర్దుబాట్లలో చర్చలు విఫలమవడంతో ఆర్‌ఎల్‌ఎస్‌పి వారిపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తమ పార్టీకి బిజెపి కేటాయించిన సీట్లు ఆమోదయోగ్యం కాదని ఆయన ట్వీట్‌ చేశారు. తాను ఈ విషయంపై ప్రధానిమోడీతో సమావేశమౌతానని, సీట్ల సర్దుబాట్ల గురించి అసమ్మతి వ్యక్తం చేస్తానని ఆయన పేర్కొన్నారు. బిజెపి, జెడియులు 50-50 స్థానాలలో పోటీ చేస్తుండగా, కుష్వా పార్టీ అయిన ఆర్‌ఎల్‌ఎస్‌పికి మాత్రం తగినన్ని సీట్లు కేటాయించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీకి మరో మూడు సీట్లు కేటాయించాలని కుష్వా కోరుతున్నారు.