తమిళనాడులో ఇళవరసన్ ఆత్మహత్య
తమిళనాడు: తమిళనాడులోని ధర్మపురి రైల్వేస్టేషన్ సమీపంలో ట్రాక్పై ఓ వ్యక్తి మృతదేహాన్ని గురువారం పోలీసులు గుర్తించారు. అది దళిత యువకుడు ఇళవరసన్(23)దని రైల్వే పోలీసులు గుర్తించారు. వన్నియం అనే తెగకు చెందిన దివ్య అనే అమ్మాయిని ఇళవరన్ ప్రేమించాడు. వీళ్లిద్దరూ నవంబర్ 2012లో పెళ్లిచేసుకున్నారు. ఈ వివాహం ఇష్టంలేని దివ్య తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ధర్మపురి జిల్లాలోని మూడు గ్రామాల్లో కుల విద్వేషాలు చెలరేగాయి. అయితే ఈ ఘటన జరగక ముందు రోజు దివ్య ఆమె భర్త నుంచి విడిపోయి, తల్లితోనే కలిసుంటానని చెప్పింది. భర్తపై ప్రేమ కంటే నాన్న ఆత్మహత్య చేసుకున్నారన్న వార్తే తనను కలవరపరిచిందని ఆమె పోలీసులకు తెలిపింది.