తమిళనాడు శాసనసభను ముట్టడించిన ముస్లింలు

చైన్నై,(జనంసాక్షి): వేలాది మంది ముస్లింలు ఈ రోజు తమిళనాడు శాసనసభను ముట్టడించారు. పలు డిమాండ్లతో వారు ఆందోళనకు దిగారు. ముస్లిం వివాహాలకు చట్టబద్దత కల్పించాలని, రిజర్వేషన్లు 8 శాతానికి పెంచాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పదేళ్లుగా జైళ్లలో మగ్గుతున్న వారిని విడుదల చేయాలని వారు కోరారు. ఇప్పటి వరకు దాదాపు 5 వేల మంది ముస్లింలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.