తరిగొప్పులలో బడిబాట

జనగామ,జూన్‌5(జనం సాక్షి): జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, గ్రామ పెద్దలు కలిసి జయశంకర్‌ బడి బాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు మోగిలిచర్ల చంద్రమౌళి , గ్రామ సర్పంచ్‌ సిద్ధిని మైపాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు ప్రభుత్వ పాటశాలల్లో కల్పిస్తుందని, ప్రతి ఒక్కరూ విధిగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్‌ రవి,ఉపాధ్యాయులు జీయర్‌ స్వామి,అర్జుల రాజు,వేణుగోపాల్‌ రెడ్డి,కనకయ్య, శ్రీనివాస్‌, రజినీ,నీరజ అనసూయ తదితరులు పాల్గొన్నారు.