తల్వార్‌ దంపతుల అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం

న్యూఢిల్లీ : అరుషి హత్య కేసులో తల్వార్‌ దంపతుల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో 14 మంది సాక్షులను సీబీఐ విడిచి పెట్టడాన్ని సవాల్‌ చేస్తూ నుపుర్‌ తల్వార్‌, రాజేశ్‌ తల్వార్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీం తిరస్కరించింది.