తాండూర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వచ్చిన అభ్యర్థి గెలుపే ధ్యేయంగా ముందుకు వెళ్తాం.

తాండూర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వచ్చిన అభ్యర్థి గెలుపే ధ్యేయంగా ముందుకు వెళ్తాం.

తాండూరు అక్టోబర్ 2(జనంసాక్షి)తాండూర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఎవరికి వచ్చిన అభ్యర్థి గెలుపే ధ్యేయంగా ముందుకువెళ్లడం జరుగు తుందని వికారాబాద్ జిల్లా యాలాల్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు అయ్యా గాళ్ళ బీమయ్య, నాయకులు రాజేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా యాలాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018లో మాదిరిగానే ప్రస్తుతం కూడా కొనసాగుతుందని..అమ్ముడుపోయే నాయకులను నమ్మరాదని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం నిరంతరా యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ మహిళా డిక్లేషన్ ప్రకటించి ధరణి పోర్టల్ రద్దు రెండు లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించారని.. దీనిని ప్రతి గ్రామంలో గడపగడపకు తీసుకువెళ్లాలని సమావేశంలో నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నాయకులు కమల్ పూర్ బస్వరాజ్, రాములు, ఎంపీటీసీ మల్లప్ప, ప్రశాంత్ కుమార్, టైలర్ నాగయ్య,
దేవనూర్ ఖాసీం, పగిడిపల్లి నర్సిములు, ముకుంద పూర్ సాయిలు, కమల్ పూర్ ఉప సర్పంచ్ రాం చందర్,విశ్వనాధ్ పూర్ నాగప్ప, రాఘపూర్ చంద్రప్ప, ఆరిఫ్, గోరెపల్లి ఎల్లప్ప, ప్రవీణ్, నగేష్ లక్ష్మినారాయణపూర్, చెన్నారం మల్లయ్య, జంటుపల్లి విజయ్ కుమార్, అసప్ప, కిష్టప్ప,బెన్నూర్ మల్లప్ప, సంగేమ్ సర్యనారాయణ, లాలప్ప,హాజీపూర్ వెంకటేష్,
తదితర మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.