తాడికల్ లో కంటి శిబిరం

ప్రారంభించిన ప్రథమ పౌరుడు
శంకరపట్నం, జనం సాక్షి ఫిబ్రవరి 16 మండల పరిధిలో తాడికల్ గ్రామ రైతు వేదికలో గురువారం తాడికల్ గ్రామ సర్పంచ్ కీసర సుజాత కంటి శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కంటి శిబిరాన్ని ప్రారంభించడం దేశానికే ఆదర్శం అన్నారు ఈ కంటి శిబిరాన్ని గ్రామంలోని దృష్టిలోపం ఉన్నవాళ్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు కంటి వెలుగు డాక్టర్లు సూచన మేరకు అందుబాటులో ఉన్న కళ్ళజోళ్ళు అందిస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఎంపీ ఓ బస్సిరోద్దీన్ డాక్టర్ సుమన్ ప్రభుత్వ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు