తాత్కాలికంగా నిలిపోయిన అమర్‌నాథ్‌ యాత్ర

శ్రీనగర్‌: వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో శుక్రవారం ప్రారంభమైన అమర్‌నాథ్‌ యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. యాత్రికులను బల్తాల్‌, పహల్‌గామ్‌లోని బేస్‌ క్యాంపుల్లో అధికారులు నిలిచివేశారు. అమర్‌నాథ్‌ యాత్రకు ఈసారి 6 లక్షల మంది యాత్రికులు నమోదు చేసుకున్నారు. తీవ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో యాత్రకు  భారీ భద్రత చేపట్టారు.