తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ : ప్రాథమిక పాఠశాలల్లో తాత్కాలిక ఉపాధ్యాయుల నియామకంపై రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన అర్హతలేని వారిని తాత్కాలిక ఉపాధ్యాయులుగా నియమిస్తే విద్యా వ్యవస్థ భ్రష్ఠు పడుతుందని కోర్టు వ్యాఖ్యానించింది.