తిరుమలలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

తిరుపతి : గుంటూరుకు చెందిన ఓ ప్రేమజంట తిరుమలలో ఆత్మహత్యాయత్నం చేసింది. మోకాళ్ల మెట్టు పర్వతం వద్ద ఆత్మహత్యకు పాల్పడుతున్న ప్రేమజంటను గుర్తించిన టీటీడీ సెక్యూరిటి సిబ్బంది అడ్డుకున్నారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. వీరు అచ్చంపేటకు చెందిన సరస్వతీ, రాజీవ్‌గా గుర్తించారు.