తిరుమల శ్రీవారి సేవలో కోడెల

తిరుమల,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి):  ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుని మండపంలో వేదపండితులు కోడెలను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలను అందజేశారు. విభజన తర్వాత దశాదిశలేని ఏపీని చంద్రబాబు అభివృద్ధిపథంలో నడిపిస్తున్నారని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలతో పేదలను ఆధుకుంటున్న టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు.