తీహార్‌ జైల్లోనే అఫ్జల్‌గురు మృతదేహం ఖననం

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ దాడి కేసులో అఫ్జల్‌ గురుకు ఢిల్లీలోని తీహార్‌ జైల్లో ఈ ఉదయం 8 గంటలకు ఉరి శిక్ష అమలు చేశారు. అనంతరం జైల్లోనే అతని మృత దేహాన్ని ఖననం చేశారు. అతన్ని ఉరితీసిన ప్రదేశానికి సమీపంలోని జైల్‌ నెం 3 వద్ద మృతదేహాన్ని ఖననం చేసినట్లు సమాచారం. అధికారుల ఆదేశాల మేరకు జైల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేశారు.