తుమ్మలతో భట్టి భేటి

Bhatti Vikramarka: రాష్ట్ర రాజకీయాల్లో తుమ్మల మచ్చలేని వ్యక్తి: భట్టి విక్రమార్కదమ్మపేట(జనంసాక్షి):మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఆదివారం ఆయన్ను కలిశారు.సుమారు గంటపాటు నేతలిద్దరూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా భట్టిని తుమ్మల శాలువాతో సత్కరించారు.సమావేశం అనంతరం భట్టి విక్రమార్క విూడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో తుమ్మల మచ్చలేని వ్యక్తి అని అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో ఆయన అవసరం ప్రజలకు ఎంతైనా ఉందని చెప్పారు. తుమ్మలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకే వచ్చానని.. అభిమానులతో కలిసి తన అభిప్రాయం చెబుతానని ఆయన అన్నట్లు భట్టి తెలిపారు.తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడం దాదాపుగా ఖరారైన విషయం తెలిసిందే. ఈనెల 6న ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా వేసుకునేలా ముఖ్యనేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మలతో భట్టి విక్రమార్క భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.