తూ.గో జిల్లాలో..  మరో ముగ్గురు టీడీపీ వీడతారు

– ఒకరిద్దరు పోయినా పార్టీకి నష్టమేవిూలేదు
– రైతు కాపాడే ప్రయత్నం చేసిన పోలీసులపై నిందలా?
– చంపడం, శవరాజకీయాలు చేయడం వైపాకా, బీజేపీల అలవాటు
– ఏపీ డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప
కాకినాడ, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : టికెట్‌ రాదన్న భయంతోనే కొందరు టీడీపీని వీడుతున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. బుధవారం ఆయన రాజమహేంద్రవరంలో జరిగిన విలేకరుల
సమావేశంలో మాట్లాడారు..  పార్టీని వీడుతామని ఆరు నెలలుగా వారు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నారని.. చివరికి టికెట్‌ దక్కదని తెలిసి పార్టీ మారారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని చినరాజప్ప ధీమా వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో మరో ఇద్దరు, ముగ్గురు నేతలు పార్టీని వీడే అవకాశముందన్నారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోటని.. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధిస్తామన్నారు. ఒకరిద్దరు వెళ్లినంతమాత్రాన పార్టీకి వచ్చిన నష్టమేవిూ లేదని.. పార్టీ వీడినవారి స్థానంలో వచ్చే ఎన్నికల్లో సమర్థులే టీడీపీ నుంచి బరిలోకి దిగుతారన్నారు.  గుంటూరు జిల్లా కొండవీడులో రైతు కోటయ్యను కాపాడేందుకు పోలీసులు అన్నివిధాలా ప్రయత్నించారన్నారు ¬ంమంత్రి అన్నారు. అలాంటి పోలీసులపై వారే చంపారని నిందలు వేయడం సరికాదన్నారు. చంపడం, శవ రాజకీయాలు చేయడం వైసీపీ, బీజేపీల విధానమని మండిపడ్డారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటీ రాజీ లేదన్నారు. పోలీసులపైనా, ప్రభుత్వంపైనా వైసీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీలో పోలీసు వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని, కానీ కావాలని వైసీపీ, బీజేపీ నేతలు పోలీసులపై, ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గపు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, వారే సరియైన గుణపాఠం చెబుతారని చిన్నరాజప్ప అన్నారు.