తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతి

 హైదరాబాద్:  తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు పదోన్నతి లభించింది. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలుగా రేమాండ్‌ పీటర్‌, ఎస్‌కే జోషిలకు పదోన్నతి లభించింది. పూర్తిస్థాయి సీసీఎల్ఏ కమిషనర్‌గా రేమాండ్‌ పీటర్ ను, ఎస్‌కే జోషికి ఇరిగేషన్‌శాఖ బాధ్యతలు అప్పగించారు.