తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ

శ్రీఆర్‌ఎల్‌డీ తెలంగాణ శాఖ ఏర్పాటు

శ్రీతెలంగాణ ఓ మహత్తర ఉద్యమం

శ్రీస్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తం

శ్రీపార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌ 7 (జనంసాక్షి):

తెలంగాణ లాంటి ఉద్యమం దేశంలో తానెక్కడా చూడలేదని కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డి) నేత అజిత్‌సింగ్‌ అన్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు సమీపంలోని సుందరయ్య విజ్ఞాన్‌ కేంద్రంలో ఆదివారంనాడు ఆర్‌ఎల్‌డి తెలంగాణశాఖను ప్రారంభించారు. కన్వీనర్‌గా కపిలవాయి ఇందిరా దిలీప్‌, కో-కన్వీనర్‌గా రియాజ్‌ తదితరులను నియమించారు. ఈ సందర్భంగా తెలంగాణలో మరో కొత్త…అజిత్‌సింగ్‌ మాట్లాడుతూ  తెలంగాణకు మద్దతు తెలపకుంటే ఆ ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేదన్నారు. అన్ని రకాలుగా తాము నష్టపోయామన్న భావన ఆ ప్రాంత ప్రజల్లో బలంగా నాటుకుపోయిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నానని అన్నారు. తెలంగాణ ప్రాంత నిధులను సీమాంధ్రకు తరలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాకపోవడంతో సర్వత్రా అశాంతి నెలకొని ఉందన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోను, అసెంబ్లీ ఎన్నికల్లోను ఆర్‌ఎల్‌డి తెలంగాణ శాఖ పోటీ చేస్తుందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి  ఆర్‌ఎల్‌డి బాసటగా నిలుస్తుందని చెప్పారు.