తెలంగాణ కోసం పోరాటం కొనసాగిస్తాం :ప్రొ.కోదండరాం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రతే&్యక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం కొనసాగిస్తామని టీజేఏసీ కన్వీనర్‌ ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు. గురువారం న్యూఢిల్లీలో ప్రారంభమైన టీజేఏసీ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గతంలో చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందాన్ని కాలరాశారన్నారు. తెలంగాణ సమస్య వెనకబాటుతనమే కాదు, రాజకీయ సమస్య కూడా అని ఆయన వ్యాఖ్యానించారు. నీటిపారుదల రంగంలో తెలంగాణకు అన్యాయమే జరిగిందని కోదండరామ్‌ గుర్తు చేశారు. ఆంధ్ర కాంగ్రెస్‌ నాయకులు బలమైన వారని ఆయన అభివర్ణించారు, ఆంధ్ర ప్రాంతంలో రెవెన్యూ రాబడి చాలా తక్కువని కోదండరామ్‌ పేర్కొన్నారు.