తెలంగాణ కోసం మరోబలిదానం

బహ్రెయిన్‌ లో వలస జీవి మృతి
పండుగపూట నెలకొన్న విషాదం
గంభీరావుపేట,ఫిబ్రవరి 10(జనంసాక్షి) : తెలంగాణ కోసం మరో యువకుడు ఆత్మత్యాగం చేసుకున్న విషాద సంఘటన గంభీరావుపేట లోని మల్లారెడ్డిపేటలో పండుగ పూట విషాదాన్ని నింపింది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… .గ్రామానికి చెందిన పొన్నాల శ్రవణ్‌(24) బతుకు దెరువు నిమిత్తం 2010 సంవత్సరంలో గల్ఫ్‌ దేశమైన బహ్రెయీన్‌ కు ఉపాది కోసం వెళ్లాడు.అక్కడ పని సరిగా లేకపోవడంతో తెలంగాణ వచ్చిందా అంటూ రెండు రోజుల క్రితం కుటుం బీకులకు ఫోన్‌ చేసి మాట్లాడాడు.అంతకు ముందు 9 తరగతి వరకు చదువుకొన్న శ్రవన్‌ ఆటో నడుపుతూ జీవనం కొన సాగించాడు.బతుకుదెరువు కష్టంగా మారడంతో గల్ఫ్‌ బాట పట్టా డు.అక్కడా పని సరిగా లేకపోవడంతో తెలంగాణ వస్తే తనలాంటి నిరుద్యోగులకు ఉపాది దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేసినట్లు తెలిపారు.కేంద్రం ఆడుతున్న నాటకాలకు ఇక తెలంగాణ రాదనే బెంగతో శనివారం రాత్రి రూంలో ప్యాన్‌ కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.అతడు రాసిన సూసైడ్‌ నోట్‌ జేబులో దొరకడంతో అక్కడ ఉన్న స్నేహితులు కుటుంబీకులకు సమాచారం అందించారు.మృతుని తండ్రి రాజం,తల్లి అంజవ్వ తన కొడుకు మరణ వార్త తెలుసుకొని బోరున విలపించారు.ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామ జెఎసి,టిఆర్‌ఎస్‌ నాయకులు ఆ కుటుంబానికి తమ ప్రగాడ సంతాపాన్ని తెలిపారు.