తెలంగాణ పై కచ్చితమైన అభిప్రాయం చెబుతాం: దేవేందర్‌ గౌడ్‌

ఢిల్లీ: కేంద్రం తెలంగాణ సమస్య పరిష్కారానికి చర్యలు ,చేపడితే తమ పార్టీ తరపున కచ్చితమైన అభిప్రాయం చెబుతామని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు దేవేందర్‌గౌడ్‌ అన్నారు. పార్టీలోని అన్ని ప్రాంతాల వారిని సంప్రదించి ఓ అభిప్రాయానికి వస్తామని తెలియజేశారు.