తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సేవలు దేశానికి అవసరం సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొన్నింటి సురేష్

మోమిన్ పేట సెప్టెంబర్ 15 జనం సాక్షి
దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి సారిగా ఒక జాతీయ పార్టీ ఆవిర్భావం చెందుతున్నందున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించిస్తున్నట్లు తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి  సురేష్ తెలిపారు.  గురువారం ఆయన  ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఇప్పటివరకు ఉత్తర భారత్ నుంచి జాతీయ పార్టీలుగా ఆవిర్భవించిన కాంగ్రెస్, బీజేపీ లాంటివి దక్షిణ భారతదేశంలో ఆధిపత్యం చెలాయిస్తూ, దక్షిణ భారత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అభివృద్ధిని అణగదొక్కుతూ ఉన్నాయని చెప్పారు. దక్షిణ భారతదేశం నుంచి జాతీయ పార్టీ లేకపోవడం వల్లే ఇటువంటి పరిణామాలు జరిగి 75 ఏళ్లుగా ఈ ద్రవిడ ప్రాంతాలు అణగదొక్కబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దక్షిణ భారత బిడ్డగా ఒక జాతీయ పార్టీ నిర్మాణం చేయదలచుకున్న నిర్ణయాన్ని స్వాగతించిస్తున్నామని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా కేసీఆర్ కు మద్దతుగా నిలిస్తామని చెప్పారు.ఉత్తర భారత పార్టీల అండతో రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ఉత్తర భారత వ్యాపారులు అగర్వాల్, జాట్లు, గుజ్జర్లు, పటేల్, లోది వంటి రకరకాల కులాల వారు దక్షిణ భారతదేశంలో వ్యాపారం పేరుతో కబ్జాలకు పాల్పడుతూ, రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. దక్షిణ భారత ద్రవిడ సంస్కృతిని నాశనం చేసేటటువంటి కుట్రలను తిప్పి కొట్టాలంటే  దక్షిణ భారతదేశం నుంచి జాతీయ పార్టీ నిర్మాణం చేయదలచుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతిఒక్కరూ మద్దతుగా నివ్వాలని సురేష్ పిలుపునిచ్చారు.
Attachments area

తాజావార్తలు