తెలంగాణ రాష్టాల్ల్రో గంజాయిపై ఉక్కుపాదం

తెలంగాణలో అవినీతి అధికారులపై ఎసిబి దాడులు
వరుస దాడులతో లంచావతారుల్లో భయం
హైదరాబాద్‌,ఆగస్ట్‌14 (జనం సాక్షి) : రాష్టాల్ల్రో గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కపాదం మోపుతున్నారు. ఎక్కడా గంజాయి అన్న పదం వినిపించకుండా దాడులు సాగిస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో గంజాయి, డ్రగ్స్‌పై దాడులు పెరిగాయి. కూపీ లాగుతూ భారీ మొత్తంలో గంజాయి పట్టుకుంటున్నారు. డ్రగ్స్‌ విక్రేతలను కూడా పట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో ఎపిలో కూడా గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో రవాణా చేయాలంటే భయడపేలా చేస్తున్నారు. అన్నింటిక ఇమించి తెలంగాణలో ఎసిబి అవినీతిపరుల భరతం పడుతోంది. లంచావతారులను టార్గెట్‌ చేస్తోంది. అన్ని శాఖలల్లో అవినీతిపరులపై ఏసీబీ దృష్టిసారింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 105 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో రెడ్‌ హ్యాండెడ్‌ గా దొరికిన కేసులే అధికంగా ఉన్నాయి. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తున్న అధికారులపై అధికారులు నిఘా పెట్టారు. సోదాలు చేసి కేసులు నమోదు చేయడంతో పాటు అవినీతి సొమ్మును సీజ్‌ చేస్తున్నారు. పది రోజుల వ్యవధిలో ఆరు కేసులను ఏసీబీ నమోదు చేసింది. రెవెన్యూ, మున్సిపల్‌, పోలీస్‌, రిజిస్టేష్రన్‌, ఎక్సైజ్‌ శాఖలో ఎక్కువ అవినీతి జరిగినట్లు గుర్తించారు. శివబాలకృష్ణతో మొదలయిన దాడులు రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వరకు కొనసాగుతూనే
ఉన్నాయి. దీనికితోడు ఏసీబీ నుంచి అవినీతిపరులు తప్పించుకోలేరంటూ ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ హెచ్చరికలు జారీ చేశారు. రంగారెడ్డి అదనపు కలెక్టర్‌ భూపాల్‌ రెడ్డి ఎనిమిది లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అలాగే నిజామాబాద్‌ మున్సిపల్‌ సూపర్నెంట్‌ దాసరి నరేంద్రపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయ్యింది. నరేంద్ర ఇంట్లో రూ.2.93 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే సంగారెడ్డి సీసీఎస్‌ పనిచేస్తున్న సీఐ వెంకట కిషోర్‌పై కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి దొరికిపోయారు. లంచం డబ్బులు తీసుకోవాలంటూ జూనియర్‌ అధికారిని పురమాయించడం ద్వారా ఆ అధికారి అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తే.. ఏసీబీ అధికారులు అంతకుమించి చాకచక్యంగా వ్యవహరించి ఆయన్ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు భూపాల్‌రెడ్డితో పాటు కలెక్టరేట్‌ ఈ-సెక్షన్‌ అధికారి మదన్‌ మోహన్‌రెడ్డి కూడా పట్టుబడ్డారు. హైదరాబాద్‌ నగర శివార్లలోని గుర్రంగూడకు చెందిన జక్కిడి ముత్యంరెడ్డికి చెందిన 14 గుంటల భూమి ధరణిలో నిషేధిత జాబితాలో ఉంది. దీన్ని ఆ జాబితా నుంచి తొలగించాలంటూ పలుమార్లు రెవెన్యూ అధికారులకు ముత్యంరెడ్డి వినతి పత్రం ఇచ్చాడు. పని అవ్వకపోవడంతో ముత్యంరెడ్డి ఈ-సెక్షన్‌ అధికారి మదన్‌ మోహన్‌రెడ్డిని కలవగా ఆయన పెద్ద మొత్తంలో లంచం డిమాండ్‌ చేశారు. చివరకు రూ. 8 లక్షలకు ఒప్పందం కుదిరింది. అయితే ఈ లంచం వ్యవహారం గురించి ముత్యంరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. సోమవారం రాత్రి మదన్‌ మోహన్‌ను ముత్యంరెడ్డి కలిసి ఆ డబ్బు ఇచ్చారు.
అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు.. మదన్‌ మోహన్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులకు మదన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. మదన్‌మెహన్‌ వెంటనే భూపాల్‌రెడ్డికి తన ఫోన్‌ నుంచి కాల్‌ చేశారు. గుర్రంగూడ భూమికి సంబంధించిన విషయంలో డబ్బు చేతికి అందిందని చెప్పగానే ఆ డబ్బు తీసుకుని పెద్ద అంబర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ వద్దకు రావాలని భూపాల్‌రెడ్డి సూచించారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. మదన్‌మోహన్‌ను కారులో డబ్బుతో వెళ్లాలని ఆదేశించి.. ఆ వాహనాన్ని తమ కారులో అనుసరించారు. చెప్పిన చోటుకు వెళ్లి, అక్కడ రూ.8 లక్షలు అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డికి మదన్‌మోహన్‌ ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అక్కడి నుంచి భూపాల్‌రెడ్డి, మదన్‌మోహన్‌ను అర్ధరాత్రి కలెక్టరేట్‌కు తరలించారు. అలాగే మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అవినీతి తిమింగాలన్ని ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న సమాచారంతో నిజామాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ సూపరింటెండెంట్‌ దాసరి నరేందర్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దాసరి నరేందర్‌ ఇంటితో పాటు ఆయన కార్యాలయం, బంధువుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. ఉదయం 5 గంటలకు మొదలైన సోదాలు అర్ధరాత్రి దాటినా కొనసాగాయి. హైదరాబాద్‌ నుంచి వచ్చిన 25 మంది ఏసీబీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా దాదాపు రూ.3 కోట్ల నగదు (ను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆయన బ్యాంకు ఖాతాలో రూ.1.10 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు నరేందర్‌ ఇంట్లో ఉన్న 51తులాల బంగారం, 17 స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను సీజ్‌ చేశారు. నరేందర్‌ ఆఫీసులో రూ.90వేలు దొరికాయి. అధికారులు సీజ్‌ చేసిన నగదు, బంగారం, ఆస్తి పత్రాల విలువరూ.6,07,81,000. ఒక సూపరింటెండెంట్‌ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరకడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. నోట్లను లెక్క పెట్టడానికి
రెండు కౌంటింగ్‌ మిషన్లను ఉపయోగించారు. నిజామాబాద్‌ జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ఇంత భారీ స్థాయిలో నగదు పట్టుబడటం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. అవినీతికి పాల్పడిన నరేందర్‌ను అరెస్టు చేశారు.