తెలంగాణ సాధనే మా లక్ష్యం కోదండరాం

ఢిల్లీ : తెలంగాణ సాధనే తమ లక్ష్యమని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో కోదండరాం మాట్లాడుతూ….తెలంగాణపై ఇచ్చిన హామీని కాంగ్రెస్‌ నిలబెట్టుకోలేక పోయిందన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేయడం ప్రజాస్వామ్యానికే అవమానమని కోదండరాం వ్యాఖ్యానించారు. కల్లబొల్లి మాటలతో తెలంగాణ ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. అత్మగౌరవం కోసమే ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటున్నామని, తెలంగాణ సాధించే వరకూ పోరాటం కొనసాగిస్తామని కోదండరాం స్పష్టం చేశారు.