తెలుగు అకాడవిూ ఇంటర్‌ పుస్తకాల ఆవిష్కరణ


విద్యార్థులకు అందుబాటులోకి వచ్చాయన్న మంత్రి
నాణ్యతా ప్రమాణాలతో ముద్రించామని వెల్లడి
విజయవాడ,సెప్టెంబర్‌28 (జ‌నంసాక్షి):   తెలుగు, సంస్కృత అకాడమి, ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో ముద్రించిన ఇంటర్మీడియట్‌ పాఠ్యపుస్తకాలను రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ పుస్తకాలను ఆవిష్కరిం చారు. పోటీ పరీక్షల్లో తెలుగు విద్యార్థులు తెలుగు అకాడవిూ పుస్తకాలపై ఆధార పడుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందని తెలిపారు. తెలుగు అకాడవిూతో లక్షలాది మంది విద్యార్థులు లబ్ది పొందుతారని పేర్కొన్నారు. తిరుపతి కేంద్రంగా తెలుగు అకాడవిూ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి సతీష్‌చంద్ర, అకాడమి చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి, సంచాలకులు వి. రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. ఏపీ విభజన తర్వాత తెలుగు అకాడవిూ హైదరాబాద్‌లో ఉండి పోయింది. గత ప్రభుత్వం తెలుగు అకాడవిూని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు అకాడవిూని ప్రారంభించాం. తెలుగు, సంస్కృతి అకాడవిూగా మార్పు చేసి భాషాభివృద్దికి కృషి చేస్తున్నాం. అకాడవిూ ఏర్పాటు తర్వాత మొదటి సారిగా ఇంటర్‌ పాఠ్యపుస్తకాలని రూపొందించి ముద్రించడం అకాడవిూ ఘనవిజయమని అన్నారు. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ విూడియంలలో ఇపుడు ముద్రణ జరిగింది. ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించి 54 పుస్తకాలని ముద్రించాం. పోటీ పరీక్షలకి ప్రిపేర్‌ అయ్యే విద్యార్ధులకి తెలుగు అకాడవిూ పుస్తకాలు ఉపయోగపడతాయి. డీఎస్సీ లాంటి పోటీ పరీక్షలకి అనుగుణంగా పుస్తకాలు ముద్రించాం. డిగ్రీ, అనువాద పుస్తకాలు, ప్రాచీన, ఆధునిక పుస్తకాల ముద్రణకి తెలుగు, సంస్కృత అకాడవిూ చర్యలు తీసుకోవాలి. తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సిన తెలుగు అకాడవిూ నిధులు, ఉద్యోగుల విషయమై సుప్రీం తీర్పుకి అనుగుణంగా ముందుకు వెళ్తాం. తిరుపతి కేంద్రంగా తెలుగు, సంస్కృతి అకాడవిూ నడుస్తోంది. అన్ని సమస్యలు పరిష్కరించి తెలుగు, సంస్కృత అకాడవిూని బలోపేతం చేస్తామని అన్నారు. తెలుగు అకాడవిూ విభజనపై ఎపికి అనుకూలమైన తీర్పు వచ్చిందని తెలుగు, సంస్కృతి అకాడవిూ చైర్‌ పర్సన్‌ లక్ష్మీ పార్వతి అన్నారు. వచ్చే నెల మొదటి వారంలోపు తెలుగు అకాడవిూ విభజన పూర్తి అవుతుందని భావిస్తున్నాం. తెలుగు అకాడవిూ ముద్రించే పుస్తకాలపై విద్యార్ధులలో మక్కువ ఎక్కువ. పుస్తకాలలో నాణ్యత ఉంటుందని భావిస్తారు. పోటీ పరీక్షలు, డిగ్రీ, పీజీ పుస్తకాల ముద్రణ కూడా తయారవుతోంది. సీఎం వైఎస్‌ జగన్‌ సూచనలకి అనుగుణంగా తెలుగు, సంస్కృతి అకాడవిూని తీర్చుదిద్దుతున్నామని వివరించారు.