తొలి వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

కార్డిఫ్‌,(జనంసాక్షి): ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న సెకండ్‌ సెమీ ఫైనల్స్‌ మ్యాచ్‌లో శ్రీలంక తొలి వికెట్‌ కోల్పోయింది. ఆరు పరుగుల వద్ద భువనేశ్వర్‌ బౌలింగ్‌లో కుషాల్‌ పెరీరా నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యారు. టాస్‌ గెలిచిన భారత్‌ మొదట ఫీల్డింగ్‌ను ఎంచుకున్న విషయం తెలిసిందే.