థానేలో కూలిన భవనం: ముగ్గురు వ్యక్తుల మృతి

థానే,(జనంసాక్షి): మహారాష్ట్రలోని భీవండిలో గత అర్ధరాత్రి ఓ భవనం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని నగరంలో ప్రముఖ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు. కాగా శిథిలాలకింద మరి కొంతమంది చాక్కుకున్నట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు 29 మందిని రక్షించారు. కూలిన ఆ భవనంలో గార్మెట్‌ ఫ్యాక్టరీకి సంబంధించిన వస్తువులను భద్రపరిచేవారు.