దానంపై కేసు నమోదు చేయండి

టీ లాయర్ల ఆందోళన
హైదరాబాద్‌,జనవరి18(జనంసాక్షి): మంత్రి దానం నాగేందర్‌పై కేసు పెట్టాలంటూ తెలంగాణ న్యాయవాదుల ఆందోళనకు దిగారు. నాంపల్లి కోర్టు, పోలిస్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. తెలంగాణవాదులపై దానం తన అనుచరులతో దాడికి దిగారని, వెంటనే ఆయనపై కేసుపెట్టి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. మంత్రి దానం తెలంగాణ వ్యతిరేకిగా ప్రతర్తిస్తున్నారని లాయర్ల జెఎసి కన్వీనర్‌ రంగారావు ఆరోపించారు. మంత్రిగా ఉంటూ అహంకాపూరితంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఆయన చర్యలు తెలంగాణ ప్రాం ప్రజలను కించపరిచేవిగా ఉన్నయన్నారు. మంత్రి దానం నాగేందర్‌ పైన కేసు నమోదు చేయాలని తెలంగాణ ప్రాంత నాంపల్లి కోర్టు లాయర్లు డిమాండ్‌ చేశారు. నాగేందర్‌, ఆయన అనుచరులు వీధి రౌడీల్లా ప్రవర్తించి న్యాయవాది పైన చేయి చేసుకున్నారని, అందుకు ఆయన పైన కేసు పెట్టి అరెస్టు చేయాలని లాయర్లు డిమాండ్‌ చేశారు. దానం తీరును నిరసిస్తూ నాంపల్లి కోర్టు లాయర్లు విధులను బహిష్కరించారు.