దిగ్విజయ్తో సమావేశమైన లగడపాటి
న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విజయవాడ లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్ సూచించారు. శుక్రవారం దిగ్విజయ్సింగ్తో లగడసాటి న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. గత ఆదివారం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్ వ్యక్తిగత కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం వచ్చారు. ఆ మరుసటి రోజు ఆయన హైదరాబాద్కు విచ్చేశారు. ఆ పర్యటనలో భాగంగా గాంధీ భవనంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి దిగ్విజయ్సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తయన ప్రసంగిస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై కేంద్ర ప్రభత్వం కసరత్తు చేస్తుందని తెలిపారు. అలాగే ఆ ప్రక్రియ తుది దశలో ఉందని పేర్కొన్నారు. దాంతో లగడపాటి దిగ్విజయ్సింగ్తో భేటీ అయ్యారు.