దిగ్విజయ్‌సింగ్‌తో ముగిసిన టీజేఏసీ నేతల భేటీ

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర వ్యవహారాల సలహాదారు దిగ్విజయ్‌ సింగ్‌తో తెలంగాణ జేఏసీ నేతల భేటీ ముగిసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అంశంపై త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలన్న దిగ్విజయ్‌సింగ్‌ విజ్ఞప్తి చేశామన్నారు. తమ నిర్ణయంపై ఆయన సానుకూలంగా స్పందించారని కోదండరాం తెలిపారు.