దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశమైన ఎంపీలు

ఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌తో ఇవాళ అపార్టీకి చెందిన పలువురు ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణ వాదాన్ని గట్టిగా నిలిపి స్తున్న రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి, సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌లు వేర్వేరుగా దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన అంశం వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.