దివ్యాంగులకు బస్సు పాసులు అందజేత.

దివ్యాంగులకు బస్సు పాసులు అందజేత.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 4. (జనంసాక్షి). తంగళ్ళపల్లి మండలం మండేపల్లి కెసిఆర్ నగర్ లోనీ పలువురు దివ్యంగులకు బుధవారం హిందూ సాంస్కృతిక సమితి అధ్యక్షులు పత్తిపాక సురేష్ ఉచిత బస్సు పాసులను అందజేశారు. ఈ సందర్భంగా పత్తిపాక సురేష్ మాట్లాడుతూ కెసిఆర్ నగర్ కాలనీలో పలువురు దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులు తన ఎంతో కలిసివేసేయని అన్నారు. తనవంతుగా వారికి సహాయం అందించాలనే ఉద్దేశంతో వందమంది దివ్యాంగులకు బస్సు పాసులను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హిందూ సంస్కృతిక సమితి నాయకులు కూరపాటి శ్రీధర్, బల్ల మహేష్, గుండేటి రవితేజ సామలేటి గన్ శ్యామ్ ఆర్టీసీ అధికారులు ఎస్ టి ఐ సారయ్య, రామ్ రెడ్డి నాయక్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.