దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి

 రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల , వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు.దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అండగా నిలుస్తుందన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను జిల్లాలో ఉన్న దివ్యాంగులు సద్వినియోగం చేసుకొని కోరారు.క్రీడా పోటీల వల్ల మానసిక, శారీరక దృఢత్వంతో పాటు వారిలో పోటీతత్వం పెరుగుతుందని తెలిపారు.క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్, జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతి పద్మ , వార్డు కౌన్సిలర్ తాహెర్ , జిల్లా కార్యాలయ సూపరింటెండెంట్ హుస్సేన , సిడిపిఓలు శ్రీవాణి , కిరణ్మయి , శ్రీజ , విజయ చంద్రిక , జిల్లా సమన్వయకర్తలు సంపత్ , వినోద్ , జిల్లా దివ్యాంగ సంక్షేమ సంఘాల ప్రతినిధులు మదనాచారి, నహీమ్ , జహీర్ బాబా, చిలక నాగేశ్వరావు, చింత సతీష్ , గిద్ద రాజేష్ తదితరులు పాల్గొన్నారు