దేశంలోనే అతిపెద్ద రైల్వే సొరంగమార్గం ప్రారంభం

శ్రీనగర్‌,(జనంసాక్షి): జమ్మూలోని బనిహాల్‌ నుంచి కాశ్మీర్‌లోని కాజీగుండ్‌ల మధ్య రైలు మార్గాన్ని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ప్రారంభించారు. రైలులో ఆ మార్గం గుండా ప్రధానితో సహా యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రయాణించారు. 18 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గంలో దేశంలోనే పొడవైన, ఆసియా ఖండంలోనే రెండో పొడవైన సొరంగ మార్గం ఉండటం విశేషం!.