దేశవ్యాప్తంగా ఘనంగా ఛట్‌ పూజలు

న్యూఢిల్లీ,నవంబర్‌14(జ‌నంసాక్షి):దేశ వ్యాప్తంగా చట్‌ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఒడిశా, బీహార్‌, జార్ఘండ్‌, యూపీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు. నదీ తీరాల్లో ఆదిత్యుడికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అత్యంత నిష్టగా నహాయ్‌ఖాయ్‌ ఆచరిస్తున్నారు. ఇక నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ వేడుకల్లో మొదటి రోజును నహాయ్‌ ఖాయ్‌, రెండోరోజును ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ఘ్య్‌, నాలుగవరోజును పార్నాగా పిలిస్తారు.